కొత్త పార్టీలోకి నవజ్యోత్ సింగ్..

 

బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎంపీ నవజ్యోత్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారా.. లేక కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అన్నదానిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం సిద్దూ ఆప్ పార్టీలోనే చేరుతారు అనుకున్నారు. కానీ సిద్దూ డిమాండ్లకు ఆప్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎంట్రీకి బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు సిద్దూ కొత్త రాజకీయ పార్టీలో చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 9న ప్రారంభం కానున్న ఆవాజ్-ఇ-పంజాబ్ అనే రాజకీయపార్టీలో సిద్ధూ చేరనున్నట్లు సమాచారం. దీంతో సిద్దూ ఏ పార్టీలో చేరుతారో అన్న సందేహాలకు తెరపడింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu