2 వేలమంది ఖైదీల నిరాహార దీక్ష..


ఒకరు కాదు ఇద్దరు ఏకంగా రెండు వేల మంది ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టారు. అది కూడా తోటి ఖైదీలకు సహాయం చేయడానికి. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. అసలు సంగతేంటంటే.. ఆగ్రా జైలులో కొంత మందికి  14 ఏళ్ల జైలు శిక్ష ముగిసింది. అయితే వారిని విడుల చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో తోటి ఖైదీలు ఆందోళన చేపట్టారు. 14 ఏళ్ల జైలు శిక్ష ముగిసిన వారందర్నీ విడుదల చేయాలని, అంతవరకు తాము నిరాహార దీక్ష విరమించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తమను పరామర్శించాలని, ఆయనతో తమ గోడును వెళ్లబోసుకుంటామని వారు చెబుతున్నారు. కాగా వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా మారడంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu