ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ నేచురల్ మ్యూజియంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 1.45 ప్రాంతంలో పై అంతస్తులో మంటలు చేలరేగాయి. చూస్తుండగానే భవనమంతా వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 37 ఫైరింజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. నేచురల్ మ్యూజియమ్‌‌తో పాటు ఫిక్కి ఆడిటోరియం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. మంటలను అదుపుచేస్తున్న క్రమంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరిని చికిత్స నిమిత్తం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. మంటలు సమీప ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదముండటంతో చుట్టుప్రక్కల భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు.