తెలుగు రాష్ట్రాలకు కోర్టు ధిక్కరణ నోటీసులు..

 

అక్రమ ఇసుక తవ్వకాలపై ఆంధ్రరాష్ట్రంతో పాటు తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్రాలకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాకు పాల్పడుతున్నాయంటూ రేలా అనే స్వచ్ఛంద సంస్థ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారించిన జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) నాలుగు రాష్ట్రాలకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. దీనిపై రెండు వారాల్లో సమాధానమివ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై చివరి వారానికి వాయిదావేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu