పాక్‌ ఉగ్రవాద ఉత్పత్తి కేంద్రం-మోడీ

పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్రమోడీ. చైనాలో జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా ప్రసంగించిన మోడీ..పాక్ పేరు నేరుగా ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శలు చేశారు. దక్షిణాసినయాలో ఓ దేశం ఉగ్రవాదులకు స్థావరంగా మారిందని మండిపడ్డారు. ఆ దేశం ఉగ్రవాదుల ఉత్పత్తి కేంద్రంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులతో ప్రకటనలు చేయిస్తూ, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. దక్షిణాసియాలో ఏ సంఘటన జరిగినా ఆ దేశ ఉగ్రవాదుల హస్తం ఉంటోందని విమర్శించారు. ఒక్క దేశం కారణంగా దక్షిణాసియా మొత్తం ఉగ్రవాదుల బాధితులుగా మిగులుతోందన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu