మోడీకి అఫ్ఘాన్ పురస్కారం..

 

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఓ పురస్కారం దక్కింది. మోడీ విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం అఫ్ఘానిస్థాన్లో ఉన్నారు. అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని మోడీకి ఆమిర్‌ అమానుల్లా ఖాన్‌ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతంరం.. ఆఫ్ఘన్‌-భారత్‌ ఫ్రెండ్‌షిప్‌ డ్యామ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. 'నిజమైన సోదరభావానికి లభించిన గౌరవం ఇది. అఫ్ఘానిస్థాన్‌ అత్యున్నత పౌర పురస్కారమైన ఆమిర్ అమానుల్లా ఖాన్ అవార్డు ప్రధానికి లభించింది' అని విదేశాంగ కార్యదర్శి వికాస్‌ స్వరూప్‌ ట్విట్టర్‌లో తెలిపారు. ప్రధాని మోదీ అవార్డు అందుకుంటున్న ఫొటోను ఆయన షేర్‌ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu