ప్రశాంతంగా నారాయణఖేడ్ ఉప ఎన్నికలు..

నారాయణఖేడ్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటింగ్ ప్రారంభమైన కొంతసేపు మందకొడిగా సాగినా ప్రస్తుంత ఊపందుకున్నట్టు తెలుస్తోంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ ఓటింగ్ సమయం ఉండగా.. 5గంటల తరువాత క్యూలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. అధికారులు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నీడ కోసం మామిడి తోరణాలతో కూడిన టెంట్లను ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటిని అందుబాటులో ఉంచారు. 286 కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని.. వెబ్‌కాస్టింగ్ సాయంతో జిల్లా కలెక్టర్ లాప్‌టాప్‌లో పర్యవేక్షిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu