కాశ్మీర్ లో కాల్పులు.. ఆర్మీ జవాన్లు మృతి

కాశ్మీర్ లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని మర్సారి గ్రామంలో ఓ ఇంట్లో తీవ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం రావడంతో.. రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ అపరేషన్ గ్రూప్, సీఆర్పీఎఫ్ పోలీసులు తీవ్రవాదులు దాగి ఉన్న ఇంటిని చుట్టిముట్టారు. విషయాన్ని గమనించిన తీవ్రవాదులు వెంటనే విచక్షణారహితంగా భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారు. దీంతో  భద్రత దళాలు, తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు గాయపడినట్టు పోలీసు అధికారి తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu