ఇది అన్నగారి మనవడు ఇస్తున్న మాట: లోకేష్

నెల్లూరు జిల్లాలోని కావలిలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని టీడీపీ చాలా సీరియస్ గా తీసుకుంది. తాజాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు అంశంపై స్థానిక నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. అన్నగారి మనవడు ఇస్తున్నా.. తారకరాముడి విగ్రహం మళ్లీ ఏర్పాటవుతుంది అని లోకేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

"నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గం, ముసునూరు గ్రామంలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని వైకాపా నాయకులు తొలగిస్తుండగా అడ్డుకున్న టిడిపి నాయకులు, కార్యకర్తలతో మాట్లాడాను. ఐదుగురు టిడిపి నాయకులపై అక్రమ కేసులు పెట్టారు. బాధితులతో మాట్లాడి అన్ని విధాలా అండగా ఉంటా అని హామీ ఇచ్చాను." అని లోకేష్ తెలిపారు.

"తీసిన చోటే ఆ తారకరాముడి విగ్రహం మళ్లీ ఏర్పాటు అవుతుంది. ఇది అన్నగారి మనవడు ఇస్తున్న మాట." అని లోకేష్ చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu