మహానాడు ఏర్పాట్లపై లోకేశ్ ఫైర్.. ఇవేం ఏర్పాట్లు?
posted on May 26, 2016 2:18PM

టీడీపీ పార్టీ అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ 'మహానాడు' రేపటి నుండి మూడు రోజుల పాటు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తిరుపతి వేడుకైంది. ఈ సందర్భంగా రేపు జరగబోయే కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చూసేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొద్దసేపటి క్రితం తిరుపతికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మహానాడు కార్యక్రమ ఏర్పాట్లు చూసిన నారా లోకేశ్ ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ‘‘ఇవేం ఏర్పాట్లు? ఇలాగైతే ఈ వేడుకను సంతోషంగా ముగిస్తామా? వెంటనే మార్పులు చేయండి. సాయంత్రంలోగా పటిష్ట ఏర్పాట్లు పూర్తి కావాలి’’ అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పార్టీ నేతలు అయోమయంలో పడ్డారట. దీంతో పార్టీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు వెనువెంటనే రంగంలోకి దిగిపోయి లోకేశ్ చెప్పిన మేరకు ఏర్పాట్లలో మార్పులు చేర్పులు చేసేందుకు చర్యలు చేపట్టారు.