రాష్ట్రపతి చేతుల మీదగా బ్రాహ్మణికి అవార్డు..

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణికి అరుదైన గౌరవం దక్కింది. బ్రాహ్మణికి జాతీయ ఇంధ‌న సంర‌క్ష‌ణ పుర‌స్కారం లభించింది. ప్రస్తుతం నారా బ్రాహ్మణి హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ రోజు ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా జాతీయ ఇంధ‌న సంర‌క్ష‌ణ పుర‌స్కారం అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా నారా బ్రాహ్మ‌ణి మాట్లాడుతూ... ఈ అవార్డు అందుకోవ‌డం తమకు గ‌ర్వ‌ంగా ఉందని అన్నారు. హెరిటేజ్ సంస్థ‌కు ప‌దేళ్ల‌లో 8 సార్లు అవార్డు ద‌క్కిందని చెప్పారు. హెరిటేజ్ టీమ్ క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌డంతోనే ఈ అవార్డు వ‌చ్చింద‌ని, త‌మ‌ సంస్థ పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల‌పై దృష్టి పెట్టిందని తెలిపారు.