గెలుస్తానని తెలుసు.. ఇంత మెజారిటీ ఊహించలేదు..

 

‘‘నందిగామ ఉప ఎన్నికల్లో నేను విజయం సాధిస్తానని నామినేషన్ పత్రాలు దాఖలు చేసినపుడే తెలుసు. ఇంత భారీ మెజార్టీ వస్తుందని నేను ఊహించలేదు’’ అని నందిగామలో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన తంగిరాల సౌమ్య చెప్పారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, తాను గెలుస్తానని తెలుసునని, మెజార్టీని మాత్రం ఊహించలేదన్నారు. తనను ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి సౌమ్యకు 99,748, కాంగ్రెస్ అభ్యర్థికి 24,921, స్వతంత్ర అభ్యర్థులు పుల్లయ్య 941, పుల్లారావుకు 647 ఓట్లు వచ్చాయి. నోటాకు 1178 ఓట్లు పోలయ్యాయి. విజయం సాధించిన తంగిరాల సౌమ్యకు ఎన్నిక ధ్రవీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి అందజేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu