నందమూరి జానకిరామ్ ప్రమాదంలో దుర్మరణం

 

నందమూరి కుటుంబంలో పెను విషాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ కుమారుడు నందమూరి జానకిరామ్ దుర్మరణం పాలయ్యారు. నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి జానకిరామ్ దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఆయన సఫారీ కారుకు (ఏపీ 29 బీడీ 2323) ప్రమాదం జరిగింది. రోడ్డు మూల మలుపులో రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రాక్టర్‌ ఆయన కారును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నందమూరి హరికృష్ణకు జానకిరామ్ పెద్ద కుమారుడు. మొన్నటి వరకూ అమెరికాలో ఉండేవారు. తన సోదరుడు కళ్యాణ్ రామ్ నటించిన ‘అతనొక్కడే’ సినిమాకి జానకిరామ్ నిర్మాతగా వ్యవహరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu