40 రూపాయల కోసం హత్య

 

జార్ఖండ్‌లో ఒక వ్యక్తి మరో వ్యక్తిని 40 రూపాయల కోసం హత్య చేశాడు. జార్ఖండ్‌కి చెందిన ఒక పశువుల యజమాని తన దగ్గర పశువులను మేపడానికి ఒక కాపరిని నియమించుకున్నాడు. కొంతకాలం పని చేసిన తర్వాత ఆ కాపరికి సదరు యజమాని 40 రూపాయలు, కొంత బియ్యం జీతం కింద ఇవ్వడం మిగిలి వుంది. సదరు పనివాడు యజమానిని ఎన్నోసార్లు తన డబ్బు ఇవ్వాలని అడిగాడు. దానికి యజమాని రేపు మాపు అంటూ ఎంతోకాలంగా వాయిదా వేస్తూ వస్తున్నాడు దాంతో విసిగిపోయిన సదరు పనివాడు తన యజమానిని హత్యచేశాడు.