మున్సిపల్‌ వర్కర్లకు గుడ్ న్యూస్..వేతనాలు పెంపు

 

ఏపీలో మున్సిపల్‌ శాఖలో ఔట్‌సోర్సింగ్‌ నాన్ పీహెచ్  వర్కర్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కేటగిరీ-1 వర్కర్ల వేతనం రూ.21,500 నుంచి 24,500కు, కేటగిరీ-2 వర్కర్ల వేతనం రూ.18,500 నుంచి రూ.21,500, కేటగిరీ-3 వర్కర్ల వేతనం రూ.15వేల నుంచి రూ.18,500కు పెంచింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu