ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం..17 మంది దుర్మరణం

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముంబై-పుణే జాతీయ రహదారిపై ఓ లగ్జరీ బస్సు వేగంగా వెళుతున్న బస్సు అదుపుతప్పి రెండు కార్లను ఢీకొని 20 అడుగుల లోతు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులోని 17 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా..కార్లలో ఉన్న పలువురు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu