పాక్ తో సంబంధాలు మూసుకుపోతున్నాయి.. పారికర్

 

మనోహర్ పారికర్ పాక్-భారత్ ల మధ్య చర్చల గురించి ప్రస్తావించారు. సింగపూర్లోని ఒక సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఊతం ఇస్తుందని.. ఉగ్రవాదాన్ని అంతమొందించే విషయంలో పాకిస్థాన్ చిత్తశుద్ధిపై ఇంకా సందేహాలు కొనసాగుతున్నాయని.. అందువల్ల ఆదేశంలో స్నేహ పూర్వక సంబంధాలకు భారత్ తెరిచిన తలుపులు మూసుకుపోతున్నాయని మనోహర్ పారికర్ అన్నారు. స్నేహ, సౌహార్ధ సంబంధాలకు భారత్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదని అన్నారు. మనోహర్ పారికర్ తో పాటు ఈ సదస్సులో పాల్గొన్న బీజేపీ అధికార ప్రతినిధి రాం మాధవ్ కూడా పారికర్ మాటలను సమర్ధించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu