టీడీపీలో చేరి చంద్రబాబు వద్ద పని చేయడం సంతోషంగా ఉంది : ఎంపీ వేమిరెడ్డి

 

దేవుడి దయవల్ల 2024లో ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరటం సీఎం చంద్రబాబు వద్ద పని చేయటం చాలా సంతోషంగా ఉందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. టిడిపి మంత్రులు కూలీలు ఎలా పనిచేస్తారో అలా పని చేసి మహానాడుని విజయవంతం చేశారని ఆయన అన్నారు. నేను ఆశ్చర్యపోయాను వాళ్ల పనితీరును చూసి.. ఒకపక్క వర్షం పడుతూ ఉంది ఒక పక్కనుండి నియోజకవర్గంలో కార్యకర్తలకు రకరకాల ఇబ్బందులు ఉన్న మహానాడు విజయం అంతం చేశారని ఆయన తెలిపారు. మహానాడుకి సుమారు ఆరు ఏడు కిలోమీటర్లు వరకు జనాలు భారీ ఎత్తున వచ్చారు... స్థలం సరిపోక ఎక్కడికి ఎక్కడ వాహనాలు నిలిచిపోయాయి. సభా వద్దకు చేరుకోలేక చాలామంది వెనుక తిరిగి వెళ్ళిపోయారు అది టీడీపీకి ఉన్న బలమని ఎంపీ వేమిరెడ్డి తెలిపారు. గత సీఎం జగన్ ఏనాడు కూడా ఇలా కార్యక్రమంలో కనీసం మీరు చేయండి అని కూడా  చెప్పేవాడు కాదని.. అంతా మీరే చూసుకోండి అని చెప్పేవారని ఆయన తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu