ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మిథున్రెడ్డి
posted on Jul 24, 2025 4:45PM

ఏపీ మద్యం కుంభకోణ కేసులో అరెస్ట్యిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తరుపు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A-4గా ఉన్నారు. కాగా ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కారాగారంలో ఆయనకు పలు అదనపు వసతులు కల్పిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
ఈ విచారణపై సస్పెన్స్ నెలకొంది. పిటిషన్ను కోర్టు స్వీకరించిన తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా గత వైసీపీ హయంలో లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అవనీతి జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కేసును సిట్కు అప్పగించింది. విచారణ చేపట్టడంతో పలువురు కీలక నేతలను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. . ఈ కేసులో ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణ మోహన్రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.
కౌంటర్ దాఖలు చేయాలని సిట్కు ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి. తదుపరి విచారణ ఈ నెల(జులై) 29వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.శ్రావణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు పంపించారు ఈడీ అధికారులు. PMLA చట్టం కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ నెల (జులై) 28వ తేదీ ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్లోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.