ప్రేమజంటపై పెద్దల దాడి..

 

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌లో ఒక ప్రేమ జంటను పెద్దలు దాడి చేశారు. జంటలో యువకుడిని హత్య చేశారు. యువతి కొనప్రాణాలతో వుంది. భర్తల్ గ్రామానికి చెందిన యువతి రాకేష్ సింగ్ అనే వ్యక్తిని ప్రేమించింది. వీరిద్దరూ కలసి తిరగడం చూసిన ఆమె తండ్రి మఖాన్ సింగ్, సోదరులు సుఖ్ వీర్, సునీల్, సుశీల్, ఉమీద్ ఆగ్రహించారు. మొదట రాకేష్ సింగ్‌ని ఉరివేసి చంపేశారు. ఆ తర్వాత కోపం తగ్గక తమ ఇంటి ఆడపడుచుకి కూడా విషం తాగించారు. సమయానికి గ్రామస్థులు అడ్డుపడి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం కొన ఊపిరితో వుంది. ఆ యువతి తండ్రిని, సోదరులను పోలీసులు అరెస్టు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu