చొక్కా పట్టుకున్నాడని చంపేసిన ఇన్‌స్పెక్టర్

 

తమిళనాడులో ఓ ఎస్.ఐ. ఒక అమాయకుడిని అన్యాయంగా చంపేశాడు. తన చొక్కా పట్టుకున్నాడని ఆగ్రహించిన ఎస్.ఐ. తుపాకితో కాల్చి చంపేశాడు. తమిళనాడులోని రామనాథపురంలో ఓ దుకాణదారు ఫిర్యాదు మేరకు సయ్యద్ మహ్మద్ అనే వ్యక్తిని ఎస్సై కాళిదాస్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్ళిన మహ్మద్‌ను ఎస్సై గద్దించాడు. ఓ దశలో సర్వీస్ పిస్టల్ చూపి బెదిరించాడు. దీంతో, మహ్మద్ ఆవేశంగా ఎస్సై కాళిదాస్ చొక్కా పట్టుకున్నాడు. దాంతో విచక్షణ కోల్పోయిన ఆ ఇన్‌స్పెక్టర్ పిస్టల్‌ను మహ్మద్‌కి గురిపెట్టి నిర్దాక్షిణ్యంగా రెండు రౌండ్లు కాల్చాడు. దాంతో మహ్మద్ అక్కడిక్కడే మరణించాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News