షారుక్ ఖాన్ పై మనోజ్ కుమార్ కేసు
posted on Apr 1, 2013 11:29AM
.png)
షారుఖ్ ఖాన్, ఎరోస్ ఇంటర్నేషనల్ ప్రొడ్యూసర్లుగా, ఫరాఖాన్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, దీపికా పడుకొనే 2007లో ఓం శాంతి ఓం అనే సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో మనోజ్ కుమార్ పై ఒక స్కూఫ్ వుంది. దాంతో మనోజ్ కుమార్ 2008లో ముంబై హైకోర్టులో ఒక పిటీషన్ వేశారు. దాంట్లో తన ఇమేజ్ ను కించపరిచారని ఆ సీన్లను తొలగించాలని ఉంది. కోర్టు ఆ స్కూఫ్ సీన్లను తొలగించి శాటిలైట్ ద్వారా రిలీజ్ చేసుకోవచ్చని తీర్పు నిచ్చింది. ఎరోస్ ఇంటర్నేషనల్ వారు దీనిపై స్పందించలేదు. తాజాగా ఓం శాంతి ఓం సినిమాను కోర్టును ధిక్కరించి జపాన్ లో విడుదల చేశారు. ఈ విషయం తెలుసుకున్న మనోజ్ కుమార్ మండిపడుతూ తాను ఈ చిత్ర నిర్మాతలపై సివిల్, క్రిమినల్ కేసులు దాఖలు చేస్తానని పరువునష్టం కింద 100కోట్ల రూపాయలు ప్రొడ్యూసర్లు చెల్లించాలని కేసు ఫైలు చేయనున్నారు.