తప్పిపోయిన పిల్లల కోసం బెల్జియం గొప్ప నిర్ణయం..

తప్పిపోయిన పిల్లల కోసం వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు పడే మానసిక క్షోభకు బెల్జియం ప్రభుత్వం సైతం కరిగిపోయింది. వారి కంటివెలుగులను ఎలాగైనా వారి దగ్గరికి చేర్చాలనే లక్ష్యంతో ఏ దేశ ప్రభుత్వం తీసుకొని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తప్పిపోయిన చిన్నారుల ఫోటోలను అథికారిక కరెన్సీ నాణేలపై ముద్రించేందుకు సిద్ధమవుతోంది. ఆ దేశంలోని చైల్డ్ ఫోకస్ అనే స్వచ్చంధ సంస్థ తప్పిపోయిన చిన్నారులు, లైంగిక వేధింపులకు గురైన చిన్నారులకు మద్ధతుగా నిలుస్తోంది. చిన్నారులను ఎలాగైనా వారి కుటుంబాలతో కలపాలనుకున్న ఈ సంస్థ ప్రభుత్వంతో చర్చించి కాయిన్స్ ఆఫ్ హోప్ కార్యక్రమానికి నాంది పలికింది. ఈ సందర్భంగా ఇరవై ఏళ్ల క్రితం తప్పిపోయిన లియమ్ వాండెన్ అనే చిన్నారి ఫోటో ఉన్న నాణేన్ని విడుదల చేసింది.