తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు

 

తిరుమల శ్రీవారిని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి  అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. మరోవైపు  నటులు సుమన్, రాజేంద్రప్రసాద్‌లు వేరు వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో చల్లగా ఉండేలా దీవించమని వేంకటేశ్వరస్వామి వారిని కోరుకున్నాని అచ్చెన్నాయుడు తెలిపారు