మను బాకర్, సరబ్‌జోత్ సంచలనం.. ఇండియాకి మరో కాంస్యం!

ప్యారిస్ ఒలిపింక్స్‌లో భారతదేశానికి మరో కాంస్య పతకం లభించింది. మిక్స్.డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సరబ్‌జోత్, మను బాకర్ జోడీ దక్షిణ కొరియా జోడీతో పోటీపడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మను బాకర్, సరబ్‌జోత్ జోడీ 16 పాయింట్లు సాధించగా, దక్షిణ కొరియా జోడీ 10 పాయింట్లు మాత్రమే సాధించింది. దీంతో భారత్‌కు మరో కాంస్య పతకం దక్కింది. ఇప్పటికే ఎయిర్ పిస్ట్ విభాగంలో మను బాకర్ ఒక కాంస్యాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu