మోడీకి మన్మోహన్ సలహా..

మాజీ ప్రధాని మన్మోహన్ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ సలహా ఇచ్చారంట. అందేంటంటే.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలతో సత్సంబంధాలు కలిగి ఉండమని. మన్మోహన్ సింగ్ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతు కావాలంటే సోనియా, రాహుల్‌గాంధీలతో సత్సంబంధాలు నెరపడం అవసరమని.. కాంగ్రెస్‌ పార్టీలో వారిద్దరూ అతి ముఖ్యమైన నేతలని.. వారితో కేంద్ర ప్రభుత్వం సంబంధాలు ఏర్పరచుకోకపోతే, కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇస్తుందని భావించడం కష్టమని మోడీకి చెప్పినట్లు ఆయన అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu