మేండలిన్ శ్రీనివాస్ మృతి.. మోడీ, చంద్రబాబు సంతాపం..

 

ప్రముఖ మేండలిన్ వాయిద్య విద్వాంసులు మేండలిన్ శ్రీనివాస్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ శుక్రవారం నాడు చెన్నైలో మరణించిన సంగతి తెలిసిందే. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తూ వుండగా శ్రీనివాస్ మరణించినట్టు సమాచారం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేండలిన్ విద్వాంసుడైన మేండలిన్ శ్రీనివాస్ మరణం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపాన్ని తెలియజేశారు. బాల్యం నుంచే మేండలిన్ విద్వాంసుడిగా గొప్ప ప్రతిభ కనబరచిన మేండలిన్ శ్రీనివాస్ అకాల మరణం చెందడం బాధాకరమని మోడీ, చంద్రబాబు తమ సంతాప సందేశాల్లో పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu