మమతా బెనర్జీ కోరికను అంగీకరించిన షారుఖ్

కోల్‌కత: పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్‌ఖాన్ అంగీకరించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరిక మేరకు షారుఖ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 17వ కోల్‌కత చలన చిత్రోత్సవ ప్రారంభ ఉత్సవంలో పాల్గొన్న షారుఖ్‌ను మమత కలిసారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాలని మమత చేసిన విజ్ఞప్తికి షారుఖ్ సానుకూలంగా స్పందించారు. డార్జిలింగ్‌లో ‘రాజు బన్‌గయా జెంటిల్‌మెన్’ షూటింగ్ మధురస్మృతుల్ని షారుఖ్ గుర్తు తెచ్చుకున్నారు. ఐపీఎల్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ జట్టుకు యజమానిగా షారుఖ్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu