న్యూఢిల్లీ చెన్నైఎక్స్ప్రెస్లో ప్రమాదం,33 మంది మృతి
posted on Jul 30, 2012 10:20AM
సోమవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ- చెన్నై ఎక్స్ప్రెస్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నెల్లూరు రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన కొద్ది సేపట్లోనే రైల్లోని ఎస్-11 బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 33 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తున్నది. మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని కొంత వరకు మంటలను అదుపుచేశారు. బోగీలో అగ్నికి ఆహుతైన ప్రయాణికులను బయటికి తీశారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. గ్యాస్ కట్టర్ సహాయంతో మంటలు వ్యాపించిన బోగీని రైలు నుంచి వేరు చేశారు. ఈ రైలు ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న ఎస్పీ, జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రమాద ఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.