విరిగిపడిన కొండ చరియలు: 15 మంది మృతి

 

మహారాష్ట్రలోని పూణె సమీపంలోని అంబెగావ్ తాలూకాలోని భీమ్‌రావ్ నగర్ ప్రాంతంలో భారీ వర్షాల ధాటికి కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 15 మంది మరణించినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు. శిథిలాల కింద ఇంకా అనేకమంది చిక్కుబడిపోయి వుంటే అవకాశం వుందని అంటున్నారు. శిథిలాల కింద ఇంకా 150 మంది చిక్కుకుని వున్నట్టు తెలుస్తోంది. ఈ సంఘటన జరిగిన వెంటనే విపత్తు నివారణ సంస్థ సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి.