ఎగ్జిట్ పోల్: బీజేపీ హవా

 

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రధాని మోడీ వైపు ఓటర్లు మొగ్గుచూపినట్టు అనేక సర్వేలు వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో పంచముఖ పోటీ నెలకొన్నప్పటికీ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తేల్చాయి. అయితే మహారాష్ట్రలో బీజేపీ సొంతంగా అధికారంలోకి రాలేదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే మహారాష్ట్రలో బీజేపీయే ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. అలాగే సిఓటర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ 129 శాసనసభ స్థానాలు, కాంగ్రెస్ 43, శివసేన 56, ఎన్సీపి 36, ఎంఎన్ఎస్ 12, ఇతరులు 12 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. హర్యానాలోని 90 స్థానాలలో బీజేపీ 37, ఐఎన్ఎల్డీ 28, కాంగ్రెస్ 15, హెచ్జేసీ 6, ఇతరులు 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఏబీపీ ఛానల్ ఎగ్జిట్పోల్స్ ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ 127 స్థానాలు, శివసేన 77, కాంగ్రెస్ 40, ఎన్సీపీ 34, ఎంఎన్ఎస్ 5, ఇతరులు 5 స్థానాలలో గెలిచే అవకాశం ఉంది. హర్యానాలో బీజేపీ 46, ఐఎన్ఎల్డీ 29, కాంగ్రెస్ 10, హెచ్జేసీ 2, ఇతరులు 3 స్థానాలలో గెలిచే అవకాశం వుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu