భగ్గుమన్న కంటైనర్ లారీ

 

విద్యుత్ తీగలు తగిలి కంటైనర్ లారీ భగ్గుమని కాలిపోయిన ఘటన గుంటూరు జల్లా పిడుగురాళ్ళ సమీపంలోని కొండమూరు కూడలిలో మంగళవారం ఉదయం జరిగింది. బెంగళూరు నుంచి ద్విచక్రవాహనాల లోడుతో వున్న కంటైనర్ లారీ రాజమండ్రికి వెళ్ళింది. అక్కడ వాహనాలను దిగమతి చేసిన అనంతరం తిరుగు ప్రయాణంలో వుంది. ఈ లారీ కొండుమూరు కూడలి వద్దకు రాగానే డ్రైవర్, క్లీనర్ టీ తాగటానికి లారీని పక్కకు ఆపే క్రమంలో లారీ విద్యుత్ తీగలకు తగిలింది. దాంతో వెంటనే మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక యంత్రాలకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ లారీ డ్రైవర్, క్లీనర్‌ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.