ఈనెల 29నుండి రంగారెడ్డిలో షర్మిల పరామర్శ యాత్ర

 

ఈనెల 29నుండి వై.యస్. షర్మిల రంగారెడ్డి జిల్లాలో కర్మన్ ఘాట్ వద్ద హనుమాన్ టెంపుల్ చౌరస్తా నుండి మళ్ళీ తన పరామర్శ యాత్రలు మొదలుపెడతారని రంగారెడ్డి జిల్లా వైకాపా అధ్యక్షుడు సురేష్ రెడ్డి తెలిపారు. ఈసారి యాత్రలో ఆమె ఏడు నియోజక వర్గాలలో పర్యటించి, వైయస్ మరణవార్తను తట్టుకోలేక చనిపోయిన 15 మంది వ్యక్తుల కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు. ఆమె చేపట్టబోయే పరామర్శ యాత్ర గురించి జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేసి దిగ్విజయం చేయాలని ఆయన కార్యకర్తలను కోరారు. ఆమె రంగారెడ్డి జిల్లాలో కొన్ని నియోజక వర్గాలలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారని ఆయన తెలిపారు.