తెగిన లిఫ్ట్ వైర్ ..కేంద్రమంత్రికి తప్పిన ప్రమాదం

కేంద్రమంత్రి జేపీ నడ్డాకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా బీజేపీ తెలంగాణ కార్యాలయానికి చేరుకున్నారు. నేతలతో చర్చలు ముగించుకుని ఫస్ట ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కు చేరుకునేందుకు వస్తుండగా లిఫ్ట్ వైర్ తెగిపోయింది. దీంతో లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో జేపీనడ్డా, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, ఎమ్మెల్యేలు ఎన్వీయస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. పరిమితికి మించి లిఫ్ట్ ఎక్కడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.