తెలంగాణ మంత్రుల శాఖలు మారుతాయా?

తెలంగాణ మంత్రివర్గంలో మంత్రుల శాఖల్లో మార్పులు జరుగుతాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మంత్రుల శాఖల్లో మార్పులు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్‌కు పరిశ్రమల శాఖ, జూపల్టి కృష్ణారావుకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖను అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేటీఆర్ ఇప్పటికే పంచాయతీరాజ్, ఐటీతో పాటు మున్సిపల్ శాఖలు నిర్వహిస్తున్నారు.  రెండు, మూడు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలవడే అవకాశం ఉంది. సీఎం ఇంతకు ముందు కూడా మంత్రులకు శాఖలను మార్చారు. కడియం శ్రీహరికి విద్యాశాఖ కేటాయించి, అప్పటికే విద్యాశాఖను నిర్వర్తిస్తున్న జగదీశ్ రెడ్డికి విద్యుత్ శాఖను, మంత్రి లక్ష్మారెడ్డికి వైద్య, ఆరోగ్యశాఖను కేటాయించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu