ల్యాప్‌టాప్‌లు షాక్ కొడతాయి..ప్రాణాలు తీస్తాయి..!

సెల్‌ఫోన్ పేలి పలువురు మృతిచెందిన వార్తలు వింటూ ఉంటాం. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి ల్యాప్‌టాప్‌లు వచ్చాయి. ల్యాప్‌టాప్‌పై వర్క్ చేస్తూ కరెంట్‌ షాక్‌కు గురై యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దక్షిణ ఢిల్లీలోని గోవిందపురి ప్రాంతానికి చెందిన బ్రిజేశ్ సింగ్ అనే యువకుడు తన ల్యాప్‌టాప్‌కు చార్జింగ్ పెట్టి మెయిల్స్ చూసుకుంటున్నాడు. ఈ సమయంలో కరెంట్ షాక్ తగలడంతో అతడు మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిది అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ల్యాప్‌టాప్‌ను సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే బ్రిజేశ్‌కు కొద్ది రోజుల క్రితమే పెళ్లైంది. తల్లిదండ్రులు, భార్యతో కలిసి గోవిందపురిలో నివాసముంటున్నాడు.