గెలుపు బాటలో లాలూ కుమారులు

 

బీహార్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా మహా కూటమి భారీ స్థాయిలో ముందంజలో వుంది. ఇది ఆర్జేడీ, జేడీయూ నాయకులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ డబుల్ ఆనందాన్ని పొందుతున్నారు. దీనికి కారణం, ఈ ఎన్నికలలో పోటీ చేసిన లాలూ ఇద్దరు కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ గెలుపు బాటలో పయనిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం వరకు ఓటమి బాటలో వున్న వీరిద్దరు మళ్ళీ గెలుపు బాటలోకి వచ్చారు. తేజ్ ప్రతాప్ మహువా నియోజకవర్గం నుంచి, తేజస్వి యాదవ్ రాఘోపురా నియోజకవర్గం నుంచి పోటీలో వున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu