హైకోర్టుకు చేరిన లడ్డూ వివాదం

తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారం హైకోర్టుకు చేరింది. లడ్డూ ప్రసాదం విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని  కోరుతూ సీనియర్ న్యాయవాది పోన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఒక కమిటీని వేసిన విచారణ జరపాలని పొన్నవోలు తన పిటిషన్ లో కోరారు. అయితే హైకోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. ప్రస్తుతం లడ్డూ ప్రసాదం వివాదం విషయంలో అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పొన్నవోలు పిటిషన్ పై బుధవారం విచారిస్తామని పేర్కొంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu