షర్మిలపై దుష్ప్రచారం చేస్తే ఖబడ్డార్: కేటీఆర్

 

 

 

వైసీపీ నాయకురాలు షర్మిలపై కొన్ని వెబ్ సైట్లు చెడు ప్రచారం చేసిన విషయం, ఆ ప్రచారాన్ని షర్మిలతోపాటు నటుడు ప్రభాస్ కూడా ఖండించిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడీ అంశం మీద తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇలాంటి దుష్ప్రచారం చేసేవారిని హెచ్చరించారు. షర్మిల గురించి అసత్య కథనాలు ప్రసారం చేసినా, దుష్ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. షర్మిల షర్మిల గౌరవానికి భంగం కలిగేలా సోషల్ మీడియాలో రూమర్లు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపేందుకు అవసరమైతే చట్టాన్ని కూడా మారుస్తామన్నారు. షర్మిల నుంచి ఫిర్యాదు అందుకున్న వెంటనే సీపీతో మాట్లాడి స్పందించాలని కోరామన్నారు. సోషల్ మీడియాలో ప్రముఖుల వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలా దుష్ప్రచారం చేస్తే వారిని శిక్షిస్తామని కేటీఆర్ తెలిపారు.