సుజలాం.. 2 రూపాయలకి 20 లీటర్లు

 

 

 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున సంతకాలు చేసిన ఐదు ఫైళ్ళలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కూడా ఒకటి. ప్రతి గ్రామానికీ చాలా తక్కువ ధరకి పరిశుభ్రమైన మంచినీటిని అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంతటా ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద ప్రతి గ్రామంలో రెండు రూపాయలకే 20 లీటర్ల మంచినీరు అందించే కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలు చేయడానికి ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర మంత్రి మాణిక్యాలరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రెండు రూపాయలకే 20 లీటర్ల సురక్షిత తాగునీటి పథకాన్ని చేపట్టిందని, ఈ పథకం ద్వారా ప్రతి పల్లెలో సమృద్ధిగా తాగునీటిని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.