కాలుష్యకాసారం కోటిపాం థర్మల్ ప్లాంట్?
posted on Jun 18, 2012 10:20AM
రాష్ట్రప్రభుత్వం ఇటీవల కేంద్ర అనుమతితో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న కోటిపాం థర్మల్ విద్యుత్ ప్లాంటు కాలుష్యకాసారమని ఆందోళనలు ఎక్కువయ్యాయి. అసలు ఈ ప్లాంటుకు కేంద్రం ఎలా అనుమతి ఇచ్చిందో అర్తంకావటం లేదని ఆందోళనకారులు ధ్వజమెత్తుతున్నారు. వీరికి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి కిశోర్ చంద్రదేవ్ మద్దతు ప్రకటించారు. కేంద్రంలో తాను మంత్రిగా ఉన్నప్పటికీ ఈ ప్లాంటు గురించే తన దృష్టికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కేంద్రం అనుమతి ప్లాంటు కోసం రూపొందించిన దస్త్రాల్లోని అంశాలను బహిరంగ పరచాలని ఆందోళనకారులతో పాటు ఆయనా డిమాండు చేస్తున్నారు. అయితే రాష్ట్రప్రభుత్వం ప్లాంటుకు నీతి కేటాయింపులు, లైసెన్సు మంజూరు చేసింది. ఈ మంజూరు వల్ల త్వరలో ప్లాంటు నిర్మాణానికి యాజమాన్యం ఏర్పాట్లు చేసుకోనుంది. ఈ విషయం తెలిసిన కేంద్రమంత్రి, సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఈ తప్పిదానికి చుట్టుపక్కల ప్రజలు ఎంత ఇబ్బందులు పడతారో ఆ లేఖ్యలో తెలియజేశానని చంద్రదేవ్ స్పష్టం చేశారు.