రైతు ఆత్మహత్యలపై కోదండరాం.. హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్
posted on Oct 14, 2015 4:58PM
.jpg)
తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై ఇప్పటికే ప్రతిపక్షాలు, అధికార పార్టీని ఎండగడుతున్నాయి. రైతులకు న్యాయం చేయాలని.. రైతులను ఆర్ధికంగా ఆదుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు జేఏసీ కోదండరాం కూడా రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ కు షాకిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యలపై ఆయన కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. అయితే ఇప్పటి వరకూ రైతు ఆత్మహత్యలపై ఏం మాట్లాడటం లేదని కోదండరాంపై ఇప్పుడు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేయడంతో చర్చాంశనీయమైంది. ప్రభుత్వ విధానాలు ఆత్మహత్యలను ప్రోత్సహించేలా ఉన్నాయని.. స్వామినాథన్ కమిటీ నివేదికను పట్టించుకోవడం లేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలు పెరిగాయని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని, దీని పైన తాను సమగ్ర సర్వే జరిపానని, ఇందుకు సంబంధించి తన వద్ద నివేదిక ఉందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలతో ఇబ్బందులు పడుతున్న కేసీఆర్ కు ఇప్పుడు కోదండరాం కూడా తోడయ్యాడు. మరి ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.