మళ్లీ తెరపైకి ఓటుకు నోటు..

ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మత్తయ్యకు మళ్లీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఉప్పల్ లోని మత్తయ్య ఇంటికి వెళ్లి  అధికారులు సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో వారంలోపులో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల మేరకు అరెస్టు చేయబోమని.. అవసరమైతే విచారణకు న్యాయవాదితో హాజరుకావొచ్చని వెల్లడించారు. కాగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఓటును కొనేందుకు ప్రయత్నించిన కేసులో మత్తయ్య ఏ4 నిందితుడు.