రూ.5 కోట్లిస్తే ఓటేస్తాం.. అడ్డంగా బుక్కయిన ఎమ్మెల్యేలు

 

రాజ్యసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగుస్తున్నాయి అనుకున్న నేపథ్యంలో ఇప్పుడొక ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. ఎన్నికల్లో ఓటర్లను కొనడానికి నేతలు డబ్బులతో వల విసురుతుంటారు.. అయితే ఇప్పుడు కర్ణాటక ఎమ్మెల్యేలు మాత్రం ఓటు వేయాలంటే తమకు డబ్బులివ్వాలని తేల్చిచెబుతున్నారు. అలా ఓ నలుగురు ఎమ్మెల్యేలు అడ్డంగాబుక్కయ్యారు. అసలు సంగతేంటంటే.. కర్ణాటక రాజ్యసభ స్థానాలకు ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడ పోలింగ్ తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధులు విపక్షాల నేతలను తమవైపు తిప్పుకునేందుకు ముడుపులు చెల్లించడానికి సిద్దపడుతున్నారు. ఇక దీన్ని అవకాశంగా తీసుకున్న విపక్ష నేతలు ‘రూ.5 కోట్లిస్తామంటే చెప్పండి, మా ఓటు మీకే’’ అంటూ ఆయా పార్టీల తరఫున బరిలోకి దిగిన రాజ్యసభ అభ్యర్థులకు తేల్చిచెబుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించగా.. రూ.5 కోట్లిస్తే పార్టీలతో సంబంధం లేకుండా ఓటేయడానికి తాము సిద్ధమేనంటూ కామెరా కంటికి చిక్కారు. ఈ నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు జేడీఎస్  కు చెందిన వారు కాగా, కేజీపీకి చెందిన మరో ఎమ్మెల్యే, స్వతంత్ర శాసనసభ్యుడు ఉన్నారు.