గాలి బెయిల్ పై సిబిఐ కౌంటర్

హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కార్పోరేషన్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలకు బెయిల్ ఇవ్వవద్దంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) శుక్రవారం సిబిఐ ప్రత్యేక కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. దీంతో సిబిఐ ప్రత్యేక కోర్టు గాలి, శ్రీనివాస్ రెడ్డిల బెయిల్ పిటిషన్‌ను ఈ నెల 15వ తేదికి వాయిదా వేసింది. వారు బయటకు వెళితే సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉండటమే కాకుండా, వేగవంతంగా జరుగుతున్న దర్యాఫ్తు ఆలస్యమవుతుందని అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఇటీవల గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు తమకు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu