కన్నయ్యపై దాడి చేసిన వ్యక్తి.. అమిత్ షాతో సెల్ఫీలు


జేఎన్యూ విద్యార్ధి కన్నయ్య కుమార్ ఇటీవల విమానంలో ప్రయాణిస్తుండగా.. అతనిపై మనాస్ డేక అనే వ్యక్తి హత్య చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత పోలీసులు కన్నయ్య ఆరోపణలు తప్పని తేల్చేసింది. ఇప్పుడు మనాస్ డేక బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో కలిసి తీసుకున్న సెల్ఫీలు సంచలనం సృష్టిస్తున్నాయి. పుణెలో జరిగిన ప్రమోద్ మహాజన్ స్కిల్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మిషన్ అనే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మనాస్ కూడా పొల్గొని అమిత్ షాతో సెల్ఫీలు దిగి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే వీటిని చూసిన పలువురు షాకవుతున్నారు. ఇక ఈ ఫొటోలపై స్పందించిన కన్నయ్య కుమార్.. అతనో బలమైన బీజేపీ మద్దతుదారని ఈ ఫొటోల ద్వారా అర్ధమవుతోందని అన్నాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu