ఝార్ఖండ్‌లో అగ్నిప్రమాదం..8 మంది సజీవదహనం

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కూమార్‌డూబి ప్రాంతంలోని ఓ బాణాసంచా పరిశ్రమలో నిప్పు రవ్వలు చేలరేగి భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు సజీవదహనమవ్వగా..25 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఝార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందజేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.