ఓటుకు నోటులో మత్తయ్యకు ఊరట..!

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న జెరూసలేం మత్తయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మత్తయ్యపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. దీనిని కొట్టివేయాలని మత్తయ్య తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం మత్తయ్యపై నమోదైన ఆరోపణలను కొట్టివేసింది. తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఆంగ్లో-ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.5 కోట్లు లంచం ఇస్తూ టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలను తెలంగాణ ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ కేసులో మత్తయ్య ఎ4 నిందితుడిగా ఉన్నారు.