సుప్రీం కోర్టులో జయలలిత బెయిల్ పిటిషన్ దాఖలు

 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిలు కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్‌ దాఖలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆమెను దోషిగా నిర్ధారిస్తూ నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు 100 కోట్ల జరిమానా విధించింది. ఆ తర్వాత జయలలితను బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. జయలలిత తరపున దాఖలైన బెయిల్ పిటిషన్‌ని ఈ నెల 7వ తేదీన కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో ఆమె తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టులో బెయిలు పిటిషన్‌ దాఖలు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu