మరోసారి పాక్ కాల్పులు.. మహిళ మృతి

 

పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లో కాల్పులు జరిపింది. పౌరుల నివాసాలపైకి 82 ఎంఎం, 120 ఎంఎం మోర్టార్ షెల్స్ ను ఉపయోగించారు. పాక్ జరిపిన ఈ దాడుల్లో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా...ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన భర్తను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu